పెద్దపల్లి జిల్లాలో బయల్పడిన శాతవాహన కాలం నాటి నిర్మాణాలు

  • తేలుకుంట గ్రామం వద్ద పురావస్తు తవ్వకాలు
  • బయల్పడిన రెండు వరుసల గోడలు
  • కుండలు, కొన్ని పలకలు కూడా లభ్యమైన వైనం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా తేలుకుంట గ్రామం వద్ద పురావస్తు శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హిస్టరీ-ఆర్కియాలజీ-హెరిటేజ్ (పీఆర్ఐహెచ్ఏహెచ్)కు చెందిన పరిశోధకులు ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. రెండు వరుసల ఇటుక గోడలు, కొన్ని కుండలు, పలకలు బయల్పడ్డాయి. ఇవి శాతవాహన కాలం నాటివని పురావస్తు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

Brick Walls
Telukunta Village
Peddapalli District
Archaeology
Telangana

More Telugu News